హైదరాబాద్: సియాచిన్ మంచుచరియలు విరిగిపడ్డ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరణించినవారిలో నలుగురు సైనికులు, ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. సోమవారం ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీర్లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద మంచు చరియలు విరిగిపడ్డాయి. 8 మంది సభ్యులు ఉన్న ఓ టీమ్పై మంచుచరియలు పడినట్లు సమాచారం. హైపోథర్మియా వల్ల ఆ బృందంలోని సభ్యులు మరణించినట్లు అధికారులు చెప్పారు. సియాచిన్ గ్లేసియర్లోని నార్తర్న్ సెక్టర్లో సుమారు 19వేల ఫీట్ల ఎత్తులో సైనికులు విధులు నిర్వహిస్తున్నట్లు ఆర్మీ చెప్పింది. అయితే సమీప పోస్టుల వద్ద ఉన్న రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకున్నది.
సియాచిన్లో విరిగిపడ్డ మంచుచరియలు.. ఆరుగురు మృతి